LIVE: హైదరాబాద్లో ఆరోగ్య ఉత్సవాలు - పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/640-480-23024934-thumbnail-16x9-revanth.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 2, 2024, 4:48 PM IST
|Updated : Dec 2, 2024, 5:59 PM IST
CM Revanth Reddy Live : హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 108 కోసం 136 అంబులెన్స్లను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అలాగే 102 కోసం 77 అంబులెన్స్లకు జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకోకోలా, థమ్స్అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ పూర్తి చేసారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలె నిర్మాణం పూర్తి చేసుకుంది.
Last Updated : Dec 2, 2024, 5:59 PM IST