రూ.68 లక్షల విలువైన మద్యం ప్రొక్లెయిన్​తో ధ్వంసం - karnataka liquor destroy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 8:02 PM IST

thumbnail
రూ.68 లక్షల విలువైన కర్ణాటక మద్యం- ధ్వంసం చేసిన సెబ్‌ అధికారులు (ETV Bharat)

Police Officials Destroyed Seized Karnataka liquor bottles in Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ శివారులో పట్టుబడిన మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా సెబ్​, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.68 లక్షలు విలువ చేసే 10 వేల లీటర్ల కర్ణాటక మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పి. రత్న తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమ మద్యం తరలింపులో దాదాపు 1400 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పట్టుబడిన మద్యం సీసాలను ప్రొక్లెయిన్​తో తొక్కించి ధ్వంసం చేశారు.

Penukonda Satyasai District : సెబ్​, పోలీసు అధికారులు కలిసికట్టుగా అక్రమ మద్యం పట్టుకున్నారని జిల్లా ఎస్పీ రత్న ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్​లో​ కూడా సెబ్​, పోలీస్​ అధికారుల సహకారంతో అక్రమ మద్యం రవాణాను అరికట్టతామని పేర్కొన్నారు. అక్రమ మద్యం పట్టుకునేందుకు సహకరించిన సెబ్​, పోలీస్​ అధికారులను జిల్లా ఎస్పీ రత్న అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.