నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ - CONSTABLES FIGHT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 10:36 AM IST

thumbnail
నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​ (ETV Bharat)

Constables Fight on Road in Satya Sai District : ప్రజలను రక్షించాల్సిన పోలీసులే నడిరోడ్డుపై కొట్టుకుంటున్న సంఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. రొళ్ల మండలంలోని పిల్లిగుండ్లు చెక్​పోస్ట్ వద్ద నడిరోడ్డుపై ప్రయాణికులు చూస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్నారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో భాగంగా పిల్లిగుండ్లు చెకోపోస్టులో రొళ్ల, ఆగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణస్వామి నాయక్, శివకుమార్​ను నియమించారు. 

ఆదివారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల ఎదురుగానే ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్థానికులు ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వారిని తొసుకుంటూ కొట్టుకున్నారు. పోలీసులు కొట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఎవరైనా గొడవపడితే సర్ది చెప్పాల్సిన పోలీసులే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటే ఇక శాంతిభద్రతలు ఎక్కడ ఉంటాయని ప్రజలు చర్చించుకున్నారు. విధుల నిర్వహణ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారి తీసినట్లు సమాచారం. ఈ విషయంపై రొళ్ల, అగళి ఎస్సైలు రాజశేఖర్, వీరేశ్​ సంఘటనపై విచారణ చేసి ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.