మినిస్టర్ పొన్నం ఫొటోగ్రాఫర్పై దాడి - పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం - Minister Ponnam fire on police
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 10, 2024, 9:38 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/640-480-21919298-thumbnail-16x9-minister-ponnam-fire.jpg)
Minister Ponnam Fire on Police : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోగ్రాఫర్పై దాడి జరిగింది. రథోత్సవం కార్యక్రమాన్ని ముగించుకొని మంత్రి వెళ్తున్న సమయంలో కాన్వాయ్ ముందు ఫోటోలు చిత్రీకరిస్తున్న కెమెరామెన్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కెమెరామెన్ అయినా, మీడియా ఫోటోగ్రాఫర్ అయినా సరే ఎవరి పైనా చేయి ఎత్తడం మంచిది కాదని మంత్రి పొన్నం హితవు పలికారు. దాడికి పాల్పడటం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకొని, మంత్రికి సర్ది చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు.
ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గుమ్మడి కాయ కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సనత్ నగర్ ఇంఛార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో పోతురాజుల ఆటపాటలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.