LIVE : ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం
Published : 3 hours ago
|Updated : 3 hours ago
PM Modi Mann ki Baat Live Today : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. అభివృద్ధిలో భారత్ను ప్రపంచ స్థాయిలో నెం.1 తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మనసులోని భావాలను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అంశాలను వివరించారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
Last Updated : 3 hours ago