LIVE: ఉప్పాడ బస్టాండ్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - Deputy CM Pawan Kalyan in Uppada
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 5:45 PM IST
|Updated : Jul 3, 2024, 6:50 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/640-480-21856775-thumbnail-16x9-deputy-cm-pawan-kalyan-in-uppada-live.jpg)
Deputy CM Pawan Kalyan in Uppada Live: కాకినాడ జిల్లాలో మూడో రోజు ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించాలనే అంశంపై ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఈ క్రమంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పవన్ మండిపడ్డారు. అటవీ శాఖ పరంగా కాకినాడ సమీపంలో హోప్ ఐల్యాండ్, మడ అడవులు కాపాడుకోవాలని, ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మీద అధికారులు ఒక నివేదిక అందిస్తామన్నారని, పర్యావరణ సమతుల్యత కాపాడాలని తెలిపారు. భూతాపం పెరిగిపోతోందని, అందుకే పర్యావరణ పరంగా పరిశ్రమల ఏర్పాటు సమయంలో కొన్ని నిబంధనలు పాటింపు మీద దృష్టి పెట్టామన్నారు. అటవీ శాఖ పరిధిలో లేని మడ అడవులను సైతం అటవీ శాఖ పరిరక్షణ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. నీటి పిల్లుల సంరక్షణ, వాటి గణన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే పవన్కల్యాణ్ కాకినాడ వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని, వాకతిప్ప సూరప్ప తాగునీటి చెరువు పరిశీలించారు. అనంతరం ఉప్పాడలో సముద్రపు కోతను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్ ప్రత్యక్షప్రసారం.