'రామోజీరావు వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం - సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి' - RamojiRao Musical Tribute at Ongole
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 3:49 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21839455-thumbnail-16x9-ramoji-rao.jpg)
Ongole CVN Club Musical Tribute Program to Ramoji Rao: ఈనాడు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు చిత్రపటానికి ఒంగోలు సీవీఎన్ క్లబ్లో నివాళులర్పించారు. క్రియేటివ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహీళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టీ.అరుణ హాజరయ్యారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని అరుణ కొనియాడారు. సామాన్యుడికి అండగా నిలిచి లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడని ఆమె కీర్తించారు.
అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని ఆమె పేర్కొన్నారు. అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఎందరో వ్యక్తులను సీని ఇండస్ట్రీకి పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ప్రియా ప్రూట్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈటీవీ, ఈనాడు పత్రిక అనే గొప్ప సంస్థలను స్థాపించిన మహానుభావుడని ఆమె అన్నారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయమన్నారు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానీయుడని అరుణ అన్నారు. రామోజీరావు స్వర నివాళి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు