thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 1:43 PM IST

ETV Bharat / Videos

విశాఖ వేదికగా 'నేవీ మిలన్-2024'- నౌకాదళ ఉత్సవాల్లో పాల్గొనున్న 50 దేశాలు

Navi Milan-2024 International Festival Will held in Visakha: విశాఖలో నేవి మిలన్-2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరుకానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ రెండేళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు.  

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మిలన్-2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్​లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్​లో వివిధ దేశాలకు సంబందించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్దావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్​ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.