By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 3:33 PM IST
|Updated : Feb 18, 2024, 4:25 PM IST
LIVE: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ- ప్రత్యక్ష ప్రసారం
Nara Lokesh Shankaravam Yatra in Visakha Live: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచకాలను, అవినీతిని ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. శంఖారావం యాత్ర ఆదివారం (నేడు) విశాఖలో జరగుతుంది.
ఉదయం 10 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సభ నిర్వహించనుండగా లోకేశ్ ఈ సభలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని లోకేశ్ పిలుపునిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధీనంలో భూ అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కోంటోందని తాము అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం సభ ప్రత్యక్షప్రసారం.