thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 6:07 PM IST

Updated : Apr 13, 2024, 6:42 PM IST

ETV Bharat / Videos

LIVE "నిజం గెలవాలి" ముగింపు యాత్రలో భువనేశ్వరి- తిరువూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం - Bhuvaneshwari Nijam Gelavali Yatra

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in Tiruvuru LIVE : నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 12, 13వ తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నేటితో (ఏప్రిల్ 13వ తేదీతో) ఈ కార్యక్రమం ముగుస్తుంది. గత ఆరు నెలలుగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కిలో మీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పార్టీ కార్యకర్త కుంచం సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతిచెందిన సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.  "నిజం గెలవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి" నారా భువనేశ్వరి బహిరంగ సభ ప్రసంగం తిరువూరులో ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 13, 2024, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.