కురుస్తున్న వర్షాలు - ఎరుపెక్కిన తారాబు జలపాతం - Tarabu waterfalls in Andhra Pradesh
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 11:39 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21836763-thumbnail-16x9-mud-water-in-tarabu-water-falls-in-manyam-district.jpg)
Mud Water in Tarabu Water Falls In Manyam District : ప్రకృతి అందాలకు నెలవు అయినా మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలంలో గల తారాబు జలపాతంలో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం వర్షాల కారణంగా నిత్యం పాల నురగలా పారే జలపాతం బురద నీటితో ఎరుపెక్కింది. పచ్చదనంకు వర్షాలను ఆస్వాదించే పర్యాటకులు ప్రస్తుతం తారాబు జలపాతం సందర్శించడానికి మక్కువ చూపిస్తున్నారు.
మన్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాల సవ్వడి పెరిగింది. వాగులు, గెడ్డలు ఉప్పొంగటంతో జలపాతాలు పాలనురగలా ప్రవహిస్తున్నాయి. ఒడిశా రాష్ట్ర సరిహద్దున పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు మధ్యస్థంగా తారాబు సమీపంలో ఉన్న తారాబు జలపాతం పర్యటకులను ఎంతగానో ఆకట్టుకునేేది. వందకు పైగా అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పరవళ్లు తొక్కుతూ పర్యటకులను మంత్రముగ్ధులను చేసే జలపాతం ఇప్పుడు ఎరుపురంగు సంతరించుకుని బురద మయంగా ఉంది. బాబుసాల సమీపంలోని జడిగుడ, డుడుమ జలపాతాల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.