తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లతో ఘన విజయం సాధిస్తాం : లక్ష్మణ్
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Feb 5, 2024, 7:03 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2024/640-480-20673292-thumbnail-16x9-bjp.jpg)
MP Laxman on Lok Sabha Elections 2024 : తెలంగాణలో 10 పార్లమెంట్ స్థానాల్లో 35% ఓట్లతో ఘన విజయం సాధిస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గావ్ చలో, ఘర్ చలో అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర శివారులోని హైదర్షాకోట్ మైత్రి వనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
Telangana BJP Wins 10 parliament seats 2024 : దేశంలో ప్రధాన మంత్రి మోదీని ఎదుర్కొనే సత్తా ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికీ లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 142 సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం మూసుకుందని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వంటి అనేక కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. అయోధ్య ప్రపంచైక ఆధ్యాత్మిక దేవాలయంగా మారుతుందని పేర్కొన్నారు.