గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ సేవలు విస్తరించాలి- కేంద్ర మంత్రి రామ్మోహన్​కు కేశినేని వినతి - Kesineni Meet Kinjarapu Rammohan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 3:52 PM IST

thumbnail
గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ సేవలు విస్తరించాలి- కేంద్ర మంత్రి రామ్మోహన్​కు కేశినేని వినతి (ETV Bharat)

MP Kesineni Sivanath Letter To Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu : గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు విమాన సర్వీసులు ప్రారంభించాల్సిందిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహ‌న్ నాయుడుకి విన‌తి ప‌త్రం ఇచ్చారు. విజయవాడ నుంచి వారణాసి వ‌యా వైజాగ్, విజయవాడ- కలకత్తా వ‌యా విశాఖపట్నం, విజయవాడ- బెంగళూరు వ‌యా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ- అహ్మదాబాద్, విజయవాడ - పుణే విమాన స‌ర్వీసుల ప్రారంభించాల‌ని ఎంపీ అభ్య‌ర్థించారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన స‌ర్వీసులు త‌క్ష‌ణం ప్రారంభించేలా చూడాల‌ని కోరారు. ఎంపీ అభ్యర్ధనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ రామ్మోహ‌న్ నాయుడుకి ఎంపీ అభినంద‌న‌లు తెలిపారు. కాగా రామ్మోహన్​ నాయుడు పౌర విమానయాన సంస్థ మంత్రి కావడం పట్ల ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో విమానయాన సర్వీసులు విస్తరిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.