thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 1:31 PM IST

ETV Bharat / Videos

ఉనికి కోసమే దిల్లీలో జగన్‌ ధర్నా డ్రామాలు : ఎంపీ కేశినేని చిన్ని - Kesineni Chinni Fires on Jagan

Kesineni Chinni Fires on Jagan in Vijayawada : రెడ్‌ బుక్‌ అంటే చాలు వైఎస్సార్సీపీ నాయకులకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విమర్శించారు. రెడ్‌ బుక్‌ను లోకేశ్‌ ఓపెన్‌ చేయకూడదని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఉనికి కోసమే దిల్లీలో జగన్‌ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 36 రాజకీయ హత్యలు అన్నారని, వివరాలు అడిగితే పారిపోయారని ఆక్షేపించారు. రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ అభివృద్ధిని జగన్‌ ఓర్వలేకపోతున్నారుని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Kesineni Sivanath on Vijayawada Development :  మరోవైపు విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలోనే ఎయిర్ కనెక్టివిటీ రానుందని కేశినేని చిన్ని తెలిపారు. ఇందుకనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుందని చెప్పారు. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారని అన్నారు. ఐదు నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుందని వివరించారు. అమరావతికి 14 నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్‌లో రేడియల్ రోడ్లు అనుసంధానిస్తామని పేర్కొన్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.