ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక - తర్వాత చెబుతానంటూ దాటవేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 11:21 PM IST

thumbnail

MP Balasouri Joins in Janasena: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి బాలశౌరి వెళ్లారు. సుమారు 2 గంటలకుపైగా బాలశౌరి పవన్​తో భేటీ అయ్యారు. బాలశౌరి జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న వేళ, పవన్ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ తో సమావేశం ముగిసిన తర్వాత బయటికి వచ్చిన బాలశౌరిని మీడియా ప్రశ్నించగా, జనసేనలో చేరికపై తర్వాత చెబుతానంటూ వెళ్లిపోయారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి ఇటీవలే   బాలశౌరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  

ఆయన వైఎస్సార్​సీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరతారనే కుతుహలం రాజకీయ వర్గాల్లో ఉండిపోయింది. పార్టీకి రాజీనామా చేసిన రోజున ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో ఆయన పవన్​తో భేటి కావడం ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్లైంది. కానీ, ఆయన  జనసేనలో చేరికపై ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో బాలశౌరి ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ ఇంకా వీడలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.