పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేతివాటం - ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం - MLA Julakanti on secretariat staff

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 11:01 PM IST

thumbnail
పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేతివాటం - ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం (ETV Bharat)

MLA Julakanti Brahma Reddy Angry on Secretariat Staff : ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపిన సచివాలయ సిబ్బందిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పెంచిన పింఛనుతో కలిపి లబ్ధిదారులకు 7 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. మాచర్లలోని ఎరుకల కాలనీలో సచివాలయ వెల్‌ఫేర్ అధికారి 6 వేల 5 వందల రూపాయలు మాత్రమే అబ్ధిదారులకు ఇవ్వడం వెలుగులోకి వచ్చింది. 

ఈ విషయం స్థానికులు టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందిని ప్రశ్నించగా వారు స్పందించ లేదు. తెలుగుదేశం నేతల ద్వారా సచివాలయ సిబ్బంది డబ్బుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు. విచారణలో వెల్‌ఫేర్ అధికారి లబ్ధిదారుల నుంచి 5 వందల రూపాయలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సచివాలయ వెల్‌ఫేర్ అధికారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.