గంజాయి అమ్మే వాళ్లను పట్టిస్తే వ్యక్తిగతంగా 5000 రూపాయలు ఇస్తా: మంత్రి సుభాష్ - Minister Subhash on Ganja - MINISTER SUBHASH ON GANJA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/640-480-22165244-thumbnail-16x9-minister-subhash-on-ganja.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 4:35 PM IST
Minister Subhash Participated in Mahesh Babu Birthday Celebrations: డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో సినీ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మహేశ్ అభిమానులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్లను, తాగే వాళ్లను పట్టిస్తే వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా 5000 రూపాయలు ఇస్తానని మంత్రి సుభాష్ అన్నారు. గంజాయితో దొరికిన వ్యక్తికి నాకు సంబంధం ఉందని వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గంజాయి సప్లై చేసే వ్యక్తులు హైదరాబాదులో దొరికితే అతను నా అనుచరుడు అంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సుభాష్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రంమంలో మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.