వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపి - ఆ విషయంలో ప్రపంచంలోనే నెంబర్​ 1 ఆసుపత్రిగా రికార్డు సృష్టించి - dr g nageswara rao interview

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 10:22 AM IST

Updated : Sep 12, 2024, 10:36 AM IST

thumbnail
వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపి - ఆ విషయంలో ప్రపంచంలోనే నెంబర్​ 1 ఆసుపత్రిగా రికార్డు సృష్టించి (ETV Bharat)

Dr Gullapalli Nageswara Rao Interview : ప్రపంచం ఓ రంగుల హరివిల్లు. ఉదయపు సూర్యుడిది ఓ రంగు, వికసించిన కలువది మరో రంగు. సాయం సంధ్యవేళ మబ్బులది ఇంకో రంగు. ప్రపంచంలోని ప్రతీది రంగులమయమే. ఆ రంగులను హృదయాంతరాలకు చేర్చి మనసుకు ఆనందాన్ని పంచేవి, నిత్య జీవితం సాఫీగా సాగేందుకు ముఖ్యమైనది చూపే. అనుకోని అనారోగ్య సమస్యలు, ప్రమాదాల్లో చూపును కోల్పోయిన వేలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది హైదరాబాద్​లోని ఎల్​వీ ప్రసాద్​ ఐ ఇనిస్టిట్యూట్​. 50 వేల మందికి దిగ్విజయంగా కార్నియా ట్రాన్స్​ ప్లాంటేషన్లు పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆసుపత్రిగా రికార్డు సృష్టించింది.

పేదల కోసం ఉచితంగా వైద్య సైవలు అందించటం, మారుమూల పల్లెల్లోని వారికి మెరుగైన వైద్యం అందించేందుకు విజన్​ సెంటర్ల ఏర్పాట్లు, కంటి వైద్యానికి సంబంధించిన ఆధునిక రీసెర్చ్​ వంటివి ఎల్​వీ ప్రసాద్​ ఐ ఇనిస్టిట్యూట్​ ప్రత్యేకతలు. కార్నియా ట్రాన్స్​ ప్లాంటేషన్లలో గొప్ప మైలురాయిని చేరిన సందర్భంగా ఎల్​వీ ప్రసాద్​ ఆసుపత్రి ఫౌండర్​ ఛైర్మన్​ డాక్టర్​ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రశాంత్​ గార్గ్​, ఎల్​వీ ప్రసాద్​ ఆసుపత్రికి చెందిన శాంతిలాల్​ సంఘ్వీ, కార్నియా ఇనిస్టిట్యూట్​ డైరెక్టర్​ డాక్టర్​ ప్రవీణ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక​ ముఖాముఖి.

Last Updated : Sep 12, 2024, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.