thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 11:02 AM IST

Updated : Feb 9, 2024, 6:56 PM IST

ETV Bharat / Videos

LIVE : లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

Lok Sabha Session Live 2024 : కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోని సంక్షోభాలను అధిగమిస్తూ దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి లోక్​సభలో ప్రవేశపెట్టారు. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. ఆ పదేళ్ల పాలనలోని సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి, స్థిరమైన వృద్ధి చెందే సంస్కరణలను తీసుకొచ్చామని వివరించారు.

ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమావేశాలు కావడంతో మరో రోజుకు పొడిగించారు. కావున శనివారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజుల పాటు జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో ఉభయ సభలలోనూ వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్​సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.

Last Updated : Feb 9, 2024, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.