LIVE : చార్మినార్ వద్ద కేటీఆర్ మీడియా సమావేశం - KTR at Charminar Live
Published : May 30, 2024, 11:29 AM IST
|Updated : May 30, 2024, 11:35 AM IST
KTR at Charminar Live : తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం రూపకల్పన తుది దశకు చేరుకున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఈ రెండింటిని మార్పులు చేస్తూ కొత్తగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత చిహ్నంలో రాచరికం గుర్తులు ఉన్నందున ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్తగా తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చిహ్నం కోసం 12 నమూనాలు తయారు చేయించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగా రుద్ర రాజేశంతో సీఎం చర్చించి కొన్ని మార్పులను సూచించారు. అయితే మరోవైపు రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు చార్మినార్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి చార్మినార్ను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్కు ఐకాన్గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు.
Last Updated : May 30, 2024, 11:35 AM IST