thumbnail

LIVE : ఆదిలాబాద్​లో బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్​ - KTR LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 1:25 PM IST

Updated : Apr 16, 2024, 1:41 PM IST

KTR LIVE : రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావులు వివిధ పార్లమెంట్​ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను, ప్రభుత్వ మోసాలను, కరవు తదితర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు, అభ్యర్థులకు సూచిస్తున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వరికి బోనస్, రైతు భరోసా అమలు, రుణమాఫీ అమలు చేయకపోవడం వంటికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో లోక్​సభ స్థానంలో ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆదిలాబాద్​​ పార్లమెంట్​ నియోజకవర్గ బీఆర్​ఎస్​ నేతలతో కేటీఆర్​ సమావేశమయ్యారు. వారికి ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
Last Updated : Apr 16, 2024, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.