వైభవంగా పోలేరమ్మ తల్లి కోటి మల్లెల పూజ- ఈ నెల 30న తిరునాళ్లు - Poleramma Koti Mallela Pooja - POLERAMMA KOTI MALLELA POOJA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/640-480-21303204-thumbnail-16x9-koti-mallela-pooja-in-poleramma-tirunallu-in-gunture-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 4:27 PM IST
Koti Mallela Pooja In Poleramma Tirunallu in Gunture District : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా కోటి మల్లెల పూజ వైభవంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు తరలివచ్చి మల్లెపూల పూజలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక పై పోలేరమ్మ తల్లి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి వేదపండితులతో పూజా కార్యక్రమం కనుల పండువగా జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు దేవాదాయ శాఖ నుంచి పూజ సామగ్రి అందజేశారు.
ఈ నెల 30 వ తేదీ సాయంత్రం5 గంటలకు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం జరగనున్నట్లు ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా తిరునాళ్లకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశిస్సులు పొందాలని కోరారు. జనాలు ఎక్కువగా వస్తారని బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.