Published : Feb 20, 2024, 12:05 PM IST
LIVE : కరీంనగర్లో అగ్నిప్రమాద ఘటనాస్థలి నుంచి ప్రత్యక్ష ప్రసారం
Karimnagar Fire Accident Live :కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని సుభాష్నగర్లో ఉన్న పూరిళ్లలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ఇళ్లలో ఉన్న ఐదు గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Gas Cylinder Fire Accident in Karimnagar : ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగిన ఇళ్లలో నివసిస్తున్న నివాసితులందరూ మేడారం జాతరకు వెళ్లడంతో తీవ్ర ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. 20 ఏళ్లుగా పూరిళ్లలో కార్మికులు నివాసం ఉంటున్నారని వెల్లడించారు. సుమారు 50 ఇళ్లు దగ్ధమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. ఇంకా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తమ నివాసాలను కోల్పోయామని బాధితులు రోధిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.