లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో కృష్ణా జిల్లాకు చెందిన జవాన్ నాగరాజు మృతి - Jawan Died in Ladakh Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 4:09 PM IST

thumbnail
లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో కృష్ణా జిల్లాకు చెందిన జవాన్ నాగరాజు మృతి (ETV Bharat)

Jawan Died in Accident During Ladakh Army Exercises: లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. జవాన్ నాగరాజు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో జవాన్​ నాగరాజు మృతి చెందడంతో చేవెండ్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ సేవకై ప్రాణాలను అర్పించిన జవాన్ నాగరాజుకి గ్రామస్థులు నివాళులర్పించారు. సోమవారం చేవెండ్ర గ్రామానికి జవాన్ నాగరాజు మృతదేహం రానుంది. 8 సంవత్సరాల నుంచి 52 ఆర్మెంట్​ రెజ్మెంట్​లో అతను పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 

అదే విధంగా శనివారం లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన యుద్ధ ట్యాంకు ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలో ​జరిగిన ఘటనలో ఒక జూనియర్​ అధికారితో సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. సైనిక విన్యాసాల్లో భాగంగా నది దాటుతుండగా వరదలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.