ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేశా - పీతల మూర్తియాదవ్‌కు హేమంత్‌ లేఖ - Murthy Yadav on MVV Satyanarayana

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 5:57 PM IST

thumbnail
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేశా - పీతల మూర్తియాదవ్‌కు హేమంత్‌ లేఖ (ETV Bharat)

Janasena Murthy Yadav on MVV Satyanarayana: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేశానని పేర్కొంటూ రౌడిషీటర్ హేమంత్ తనకు లేఖ రాసినట్లు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ వెల్లడించారు. తాను చేసిన నేరాలు, భూకబ్జాలు, సెటిల్​మెంట్లను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హేమంత్ ఆ లేఖలో పొందుపర్చారని పీతల తెలిపారు. దీని ద్వారా హేమంత్​కు దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. హేమంత్‌ రాసిన లేఖలోని అంశాలను మూర్తియాదవ్‌ మీడియాకు వెల్లడించారు. వారు చేసిన నేరాల గురించి సైతం హేమంత్ లేఖలో రాశారని పీతల పేర్కొన్నారు.

ఓ అజ్ఞాత వ్యక్తి ద్వారా హేమంత్ రాసిన లేఖ తనకు అందిందని మూర్తి యాదవ్ చెప్పారు. ఎంవీవీ చేసిన అరాచకాలను పూస గుచ్చినట్లు లేఖలో ఉన్నాయని, ఎంవీవీ, జీవీలతో సహా అనిల్ రెడ్డి, జవహర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలు హేమంత్​ను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేయించారని మూర్తి యాదవ్ తెలిపారు. హేమంత్​తో అక్రమాలు చేయించినందుకు వారంతా 500 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను అతనికి ఇచ్చినట్లు లేఖలో తెలిపారని పీతల మూర్తి యాదవ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.