By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 5:55 PM IST
చంద్రబాబు, పవన్పై విద్యుత్ డీఈ అనుచిత పోస్టులు - క్షమాపణలు చెప్పాలని జనసైనికులు డిమాండ్ - Janasena Activists Protest
Janasena Activists Protest in front of Vidyut DE House in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం విద్యుత్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటి ముందు జనసైనికుల నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్పై డీఈ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ పార్టీకి ఎలా పోస్టులు పెడతారని డీఈని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు డీఈ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పొరపాటున సోషల్ మీడియలో షేర్ చేశానని డీఈ వివరణ ఇచ్చారు. డీఈ చేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్ర పటాలకు జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేయించారు. ఇటువంటి పోస్టులు పెట్టవద్దని గతంలో డీఈకి చెప్పామని జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు తెలిపారు. తాము ఎన్నిసార్లు చెప్పినా డీఈ వ్యవహర శైలిలో మార్పు రాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీకి ఎలా కొమ్ము కాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.