thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 1:33 PM IST

ETV Bharat / Videos

దేవతా విగ్రహాల ధ్వంసం - టీడీపీ ఆదరణ జీర్ణించుకోలేక చేసుంటారని స్థానికుల ఆరోపణ - Destructed Idols in Kuppam

Idols Were Destructed Unidentified People in Chittoor District: చిత్తూరు జిల్లా కుప్పంలో దేవతా మూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వసనాడు, గొల్లపల్లి గ్రామాల మధ్య రావి చెట్ల కింద ఉన్న ఆలయంలోని నాగదేవతల విగ్రహాలను దుండగులు పెకలించి ధ్వంసం చేశారు. అర్థరాత్రి సమయంలో వచ్చిన దుండగులు ప్రతిష్టించి ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఎన్నికల్లో స్థానికలు టీడీపీకి బ్రహ్మరథం పట్టడంతో అభ్యర్థులు అత్యధిక మెజార్టీని అందించారు. 

ఎన్నికల్లో తెలుగుదేశానికి వచ్చిన ఆదరణ జీర్ణించుకోలేకే ఇలాంటి దురాగతానికి పాల్పడి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు గ్రామాలకు మధ్యన ఉన్న ఉండటంతో ఇరుగ్రామాల ప్రజలు వచ్చి పూజలు చేసుకునే వాళ్లమని స్థానికులు తెలిపారు. ఇరుగ్రామాల మధ్య ఎలాంటి గొడవలు, రాజకీయ కక్షలు కూడా ఏమి లేవని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడ జరగకుండా చూడాలని పోలీసులను కోరినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.