సీఎం రేవంత్​ను కలిసిన మెగాస్టార్ - రూ.కోటి విలువైన చెక్కులు అందించిన చిరు - Donations To CM Relief Fund in TS

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 2:33 PM IST

thumbnail
సీఎం సహాయనిధికి భారీ విరాళాలు - మోగా ఫ్యామిలీ నుంచి రూ.కోటి (ETV Bharat)

Huge Donation to TS CM Relief Fund for Telangana Flood Damage : వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు అందిస్తున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం జరిగింది. ఎంతో మంది సర్వస్వం కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే భారీ విరాళాన్ని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కులు అందించారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రామ్‌చరణ్‌ తరఫున మరో 50 లక్షల రూపాయల చెక్కుల్ని సీఎం రేవంత్​కు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు.

అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయనిధికి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కోటి విరాళం అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ రూ.10లక్షలు ఇచ్చారు. హీలో సాయి ధరమ్‌ తేజ్ రూ.10లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. సినీనటుడు అలీ రూ.3లక్షలు అందించారు.  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కులు అందించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.