LIVE : హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
|Updated : 2 hours ago
LIVe : సత్యసాయి జిల్లాల్లో అత్తా కోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని హోం మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనిపై విచారణ కు కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇందులో ప్రజల. భాగస్వామ్యం కూడా కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వారి ఇళ్ల వద్ద వ్యాపార వాణిజ్యం సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలు ను పోలీసు శాఖ కు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్ లు కూడా ఉన్నాయి. వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని మంత్రి కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : 2 hours ago