LIVE : దావోస్ పర్యటనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2025, 12:32 PM IST
|Updated : Jan 25, 2025, 1:46 PM IST
Chandrababu Live : ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవవనరులు, పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాలముందుంచింది. ప్రపంచం దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. పర్యటన ముగించుకొని చంద్రబాబు స్వదేశానికి చేరుకొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
Last Updated : Jan 25, 2025, 1:46 PM IST