LIVE: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY BUDGET SESSIONS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2025, 9:49 AM IST
AP Assembly Budget Sessions: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, తదితర అంశాలపై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిస్తారు. 26న శివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఆ రెండు రోజులు సభ ఉండదు. 28న సీఎం అధ్యక్షతన ఆయన కార్యాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. అందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. అదే రోజు బడ్జెట్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలను మార్చి 21వరకూ నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పడటం ఆనవాయితీ. కానీ ఇతర అంశాలేమైనా ఉంటే చర్చించేందుకు వీలుగా మార్చి 20, 21 తేదీలు రెండు రోజులు రిజర్వ్ దినాలుగా ప్రకటించారు.