By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 10:10 AM IST
టీడీపీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం: మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్
Former MLA Vijay kumar Babu Surity Bhavishattu gaurantee: వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలపై దాడులు పెరిగిపోయాయని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ (Former MLA Vijay Kumar) పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ (Babu Surity Bhavishattu gaurantee) కార్యక్రమాన్ని విజయ్ కుమార్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ కుమార్ ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు.
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి చంద్రబాబును గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని విజయకుమార్ ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన 20 కుటుంబాలకు విజయ కుమార్ స్వాగతం పలికారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చేసిన పనులు గురించి ప్రజలకు విజయ కుమార్ వివరించారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అరాచకాలు, దాడుల గురించి ప్రజలకు విజయ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.