పోలవరం ప్రాజెక్టులో పరవళ్లు తొక్కుతున్న వరదగోదారి - Polavaram Project

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:41 PM IST

thumbnail
పోలవరం ప్రాజెక్టులో పరవళ్లు తొక్కుతున్న వరదగోదారి- జలాశయాన్ని తలపిస్తున్న స్పిల్ వే (ETV Bharat)

Flood Water Increasing in Polavaram Project: ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో వరద గోదారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోలవరం ప్రాజెక్టులో వరద నీరు క్రమేపీ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద చేరుతున్న కారణంగా.. ప్రస్తుతం ప్రాజెక్టులోని స్పిల్ ఛానల్ ప్రాంతం జలాశయాన్ని తలపిస్తోంది. స్పిల్ వే ఎగువన గోదావరి నీటి మట్టం 26.770 మీటర్లకు చేరింది. స్పిల్ వే దిగువ 16.840 మీటర్ల నీటిమట్టం ఉంది. 

ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.480, దిగువ కాపర్ డ్యాం వద్ద 15.300 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. 48 హైడ్రాలిక్ గేట్లు ద్వారా దిగువకు 65వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పోలవరం కుడి కాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించిన క్రమంలో కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.