సూపర్​ మార్కెట్​లో మంటలు- రూ.50 లక్షల సరుకు దగ్దం - FIRE ACCIDENT IN SUPER MARKET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 5:58 PM IST

thumbnail
సూపర్​ మార్కెట్​లో మంటలు- రూ. 50 లక్షల విలువైన సరుకు దగ్దం (ETV Bharat)

Fire Accident In MSR Super Market In Annamayya District : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో షార్ట్ సర్కూట్ కారణంగా (MSR) ఎమ్మెస్సార్​ సూపర్ మార్కెట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విలువైన సరుకులు, వివిధ రకాల వస్తువులు కాలిపోయాయని యజమాని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సూపర్​ మార్కెట్​లో షాట్​ సర్యూట్​ జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లక్షల సరుకు దగ్దమవడంతో యజమాని కన్నీటి పర్యంతమయ్యాడు. 

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, కొంత బంగారం, విలువైన బాండ్లు కాలిపోయాని బాధితుడు వాపోయాడు. లక్షా ఇరవేల డైరీ మిల్క్, ముప్పైవేల రూపాయల ఐస్​క్రీమ్​లు, రెండు ఫ్రి​డ్జ్​లు, కంప్యూటర్​లు, సీసీటీవీలు సహా పలు వస్తువులు, సరుకులు అన్నీ మంటల్లో కాలిపోయాయని తెలిపారు. తమకు ప్రభుత్వం సహాయం అందిచాలని సూపర్​ మార్కెట్​ యజమాని కోరారు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.