thumbnail

సోలార్ పరిశ్రమ ఏర్పాటుపై సర్వే - అధికారులను అడ్డుకున్న రైతులు - Establishment of solar industry

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 4:39 PM IST

Farmers Stopped Officials For Solar Industry Survey : కర్నూలు జిల్లాలో సోలార్ పరిశ్రమ (Solar industry) ఏర్పాటుపై సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ వద్ద 2 వేల ఎకరాల్లో సోలార్ పార్కు ఏర్పాటుకు గ్రీన్ కో సంస్థ సిద్ధమైంది. అయితే సోలార్ పరిశ్రమ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని (Green Co company) స్పష్టం చేస్తున్నారు. ఇవాళ సర్వే అధికారులు పరిశీలనకు వచ్చారు. దీంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని వెంటనే గ్రామం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమకు ముందు నుంచి సోలార్​ పరిశ్రమ నిర్మించడం ఇష్టం లేదని తెలిసి కూడా అధికారులు ఇలా చెయ్యడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలంతా అధికారుల చుట్టూ చేరి ఆందోళనకు దిగారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.