ఒలింపిక్స్‌ గేమ్స్‌లో మెడల్స్‌ తీసుకొస్తే దేశానికే గౌరవం: మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ - Olympic Run in Kurnool

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 11:56 AM IST

thumbnail
ఒలింపిక్స్‌ గేమ్స్‌ ప్రారంభమవుతున్న సందర్భంగా క్రీడాకారుల ర్యాలీ (ETV Bharat)

EX MP TG Venkatesh on Olympics : ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడమే ఎంతో గౌరవమని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. భారతీయ క్రీడాకారులు ఒలింపిక్స్​లో పతకాలు సాధిస్తే మన దేశానికే గౌరవం లభిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే కర్నూలులో క్రీడా మైదానాలు అభివృద్ధి చేశామన్నారు. ఈ విధంగానే అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. పట్టణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Olympic Run in Kurnool : అంతకుముందు ఒలింపిక్స్​ క్రీడలు రేపటి నుంచి పారిస్​లో ప్రారంభం కానున్న సందర్భంగా, ఇందులో పాల్గొనే భారతీయ క్రీడాకారులకు సంఘీభావంగా కర్నూలులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. దీనిని టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు సాగింది. కర్నూలులో 10 ఇండోర్ స్టేడియంలు ఏర్పాటు చేశామని టీజీ వెెంకటేష్ అన్నారు. కానీ గత సర్కార్ వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చిందని ఆయన ఆరోపించారు. ఈసారి ఒలింపిక్స్​లో భారతీయ క్రీడాకారులు 117 మంది పాల్గొంటున్నారని, అందరూ సత్తా చాటి మెడల్స్ తీసుకురావాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్​శర్మ ఆకాంక్షించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.