LIVE: టీడీపీ అధినేత చంద్రబాబుతో 'ఈ టీవీ భారత్' ప్రత్యేక ఇంటర్వ్యూ - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Naidu Interview - CHANDRABABU NAIDU INTERVIEW
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 8:00 AM IST
|Updated : May 8, 2024, 8:53 AM IST
Chandrababu Naidu Interview LIVE : ఐదేళ్ల వైసీపీ పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నరకానికి నకళ్లుగా మారిన రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని వాగ్దానం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తామన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగానికి తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్ని వర్గాల ఆకాంక్షల్నీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన ప్రమాదకరమైన వైరస్ అని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఓటు అనే వ్యాక్సిన్తో ఆ వైరస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ అరాచక పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతున్న ఎన్నికల వేళ చంద్రబాబుతో 'ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖి
Last Updated : May 8, 2024, 8:53 AM IST