'ఎర్రమట్టి దిబ్బలు భౌగోళిక వారసత్వ సంపద- వాటిని కాపాడుకోవాలి' - Bheemili red mud dunes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 5:13 PM IST

thumbnail
'ఎర్రమట్టి దిబ్బలు భౌగోళిక వారసత్వ సంపద- వాటిని కాపాడుకోవాలి' (ETV Bharat)

Environmental Activist Rajendra Singh visited Bheemili Red Mud Dunes AP : పర్యావరణ ఉద్యమ కారుడు రాజేంద్రసింగ్ నేడు భీమిలి ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు. భౌగోళిక వారసత్వ సంపద గా దీనిని పరిరక్షించాలని అన్నారు. ఎర్ర మట్టిదిబ్బలు పర్యావరణ సహజ సంపద అని గుర్తుచేశారు. ఎర్రమట్టి దిబ్బల పై భూగర్భ నిపుణులు అనేక పరిశోధన చేయాల్సి ఉందని, వాటిని కాపాడుకోవాలని తెలిపారు. ఎర్ర మట్టి దిబ్బలు సముద్ర నీరు చొరబడకుండా కాపాడుతోందని వాటిని కాపాడాలని కోరారు. విశాఖ నగర అభివృద్హి లో ఇలాంటి పర్యావరణ విలువైన ప్రదేశాలకు నష్టం జరుగుతోందని ఆవేదన చెందారు. భీమిలిలో చిల్లపేట చెరువును కూడా రాజేంద్ర సింగ్, జనసేన పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, పీతల మూర్తి యాదవ్, ఆచార్య రాజశేఖర్ రెడ్డిలు సందర్శించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడంతో మనమెంతో లబ్జి పొందుతామని ఈ విధమైన అమూల్య సంపదను మనం చేతులారా నాశనం చేసుకోవద్దని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.