ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన - ఈనాడు ఈటీవీ ఓటు నమోదు కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 1:28 PM IST
Eenadu- Etv Voter Awerness Camp in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు హాజరై ఓటు ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. 18 సంవత్సరాలు పూర్తైన విద్యార్థులంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయబోతున్నందుకు సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
Eenadu- Etv Voter Awerness Camp At Degree collage : ఓటు హక్కు ఎంత విలువైనదో తెలుసుకున్న విద్యార్థులు వారు వక్తల నుంచి నేర్చుకున్న అంశాలను వివరించారు. తాము కూడా పది మందికి ఓటు హక్కుపై చైతన్యం కలిగిస్తామని పేర్కొన్నారు. ఓటు కేవలం హక్కు కాదు అది అందరి బాధ్యత అని తెసుకున్నామని విద్యార్థులు తెలిపారు. వారి ఒక్క ఓటు భావి తరాల మీద ప్రభావం చూపుతుంది కనుక సమర్థుడైన నేతను ఎన్నుకోవడానికి కృషి చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.