జగనన్న భూకబ్జా రివర్స్ మేళా నిర్వహించాలి- ప్రభుత్వానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి - Dokka Varaprasad On Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 2:09 PM IST

thumbnail
జగనన్న భూకబ్జా రివర్స్ మేళా నిర్వహించాలి- ప్రభుత్వానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి (ETV Bharat)

Dokka Varaprasad On Jagan : గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇటు మాచర్ల జిల్లాలో, అటు మదనపల్లి కలెక్టరేట్​ కార్యాలయంలో చూసినా ప్రజలు తమ భూములను ఆక్రమించారని దరఖాస్తులు ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూకబ్జాలు జరిగాయని అనిపిస్తోంది. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Dokka on YSRCP Land Irregularities : అందువల్ల ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూకబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మరోవైపు ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వైఎస్ జగన్​మోహన్ రెడ్డి సభకు రాకుండా తన క్యాంపు ఆఫీస్​లో మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి ఆయన విఘాతం కలిగించారని విమర్శించారు. శాసనసభ పవిత్రమైనదని చెప్పారు. మీరు సభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడే అధికారం ఉందని, అలా కాకుండా ప్రెస్​మీట్ నిర్వహించడం తప్పని జగన్​కు డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.