thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ETV Bharat / Videos

LIVE: కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేస్తున్న పవన్ కళ్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - Tirumala Laddu Issue

Deputy CM Pawan Kalyan Live : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ ఈనెల 22 నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.  అందులో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబర్ 2న తిరుమలలో విరమించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. కనక దుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేస్తున్న పవన్ కళ్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం మీ కోసంతిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని చెప్పారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారని పవన్ కల్యాణ్ నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.