ప్రభుత్వంపై పోరాడితే భయాందోళనలకు గురి చేస్తున్నారు: శ్రీనివాసరావు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 7:38 PM IST

thumbnail

CPM State Secretary V. Srinivasa Rao On YSRCP Govt : ఆసరా పేరుతో డ్వాక్రా (Dwakra) మహిళలను సీఎం జగన్ మోసం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి (CPM State Secretary ) శ్రీనివాసరావు అన్నారు. వారి పొదుపు ఖాతాలో ఉన్న నిధులకు వచ్చిన వడ్డీలో సగం కూడా తిరిగి ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు మితి మీరి వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వంపై పోరాడితే భయాందోళనలకు గురి చేస్తున్నారని, పోలీసులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని  దుయ్యబట్టారు. ఆందోళనకారులపై ఎలా వ్యవహరించాలో సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు జారీ చేసిందని దీన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తెలిపారు. విజయవాడలో ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయులకు పాఠశాల లోని విద్యార్థుల ముందే పోలీసులు నోటీసులు ఇవ్వడం, నిద్రిస్తున్న అంగన్వాడీలను మగ పోలీసులు అర్థరాత్రి అదుపు లోకి తీసుకోవడం మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని ధ్వజమెత్తారు. ఈ పద్ధతులు ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.