'విభజన హామీలన్నీ అమలు జరిగేలా కూటమి కృషి చేయాలి' - Tulasi Reddy Congratulate TDP Leaders - TULASI REDDY CONGRATULATE TDP LEADERS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 4:54 PM IST
Congress Leader Tulasi Reddy Congratulate TDP Leaders And Chandrababu Naidu : రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు జరిగేలా కూటమి పార్టీలన్నీ కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కాబోయే సీఎం చంద్రబాబు, నూతనంగా గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విభజన హామీల సాధనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి పెద్ద పీఠ వెయ్యాలని తులసి రెడ్డి కోరారు.
కేంద్రానికి సైతం బలం చేకూర్చేలా టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. కనుక అవకాశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చెయ్యాలని తులసి రెడ్డి హితవు పలికారు. అఖండ మెజారిటీతో అద్బుత విజయం సాధించివ వారికి అభినందనలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత తులసి రెడ్డి పెర్కొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకార వేడుకలపై సర్వత్రా ఉత్సాహం నెలకొంది.