భూమి పట్టాకు రూ.1.50 లక్షలు డిమాండ్​- ఏసీబీ వలలో సూపరింటెండెంట్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 3:35 PM IST

thumbnail

Collectorate Superintendent Officer Caught by ACB in YSR District : వైఎస్సార్​ జిల్లాలో చుక్కల భూమిని మార్చేందుకు రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న అధికారిని ఏసీబీ అధికారులు ట్రాప్​ చేసి పట్టుకున్నారు. జిల్లాలోని వీఎన్​ పల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపుశేఖర్​ అనే రైతు తన 6 ఎకరాల చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చులని కలెక్టరేట్​లోని సి విభాగం సూపరింటెండెంట్​ అధికారి ప్రమీలను కోరుకున్నారు. అందుకు ప్రమీల రూ.1.50 లక్షలు డిమాండ్​ చేసింది.

చుక్కల భూమిని పట్టా భూమిని మార్చడానికి మొదటి విడతగా రూ. 50 వేలు ఇవ్వాలని సూపరింటెండెంట్​ అధికారి ప్రమీల అడిగింది. అంత మొత్తం డబ్బును చెల్లించలేని వీరపు శేఖర్​ అనే రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ కలెక్టరేట్​లో ప్రమీల రైతు నుంచి రూ.50 వేలను తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ గిరిధర్​ బృందం ఆమెను పట్టుకున్నారు. ప్రమీలపై కేసు నమోదు చేసి కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ గిరిధర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.