thumbnail

LIVE : షాద్​నగర్​లో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

CM Revanth Laid Foundation Stone for Integrated School : యంగ్​ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ నిర్మాణ పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్​, మైనార్టీ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో సుమారు రూ.12 వేల కోట్లను ఖర్చు చేసి ఈ ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తొలి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్​, మధిర, హుస్నాబాద్​, నల్గొండ, హుజూర్​నగర్​, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్​, కొల్లాపూర్​, అందోల్​, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్​, స్టేషన్​ ఘన్​పూర్​, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు.  
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.