'వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175' - రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ - CM Jagan Raptadu Siddham Sabha
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/640-480-20782801-thumbnail-16x9-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 10:03 PM IST
CM Jagan key Comments: వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి క్యాంపైనర్లని సీఎం జగన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. తాము వేసే ఓటు పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఓటవుతుందని కార్యకర్తలకు వివరించారు. ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయకుండా దేని కోసం సంసిద్ధంగా ఉన్నారని చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడినవారికి, ఇతర ఏ రాజకీయ పార్టీ ఇవ్వని అవకాశాలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు.
పేద వాడి కోసం సిద్ధమని తాము నిలబడుతుంటే, పెత్తందార్ల కోసం చంద్రబాబు సంసిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తుగా రాబోయే ఎన్నికల్లో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు తమకు మొదటి సారి అవకాశమిస్తే ఇంత మంచి చేశామని ఇంక రెండోసారి, మూడోసారి ఆశీర్వదిస్తే ఇంకా చాలా మంచి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ టార్గెట్ 175 కు 175 స్థానాలు గెలవడం అని సీఎం జగన్ అన్నారు. అదే విధంగా 25కు 25 ఎంపీ సీట్లు గెలవాలన్నారు.