వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన- బాధితులను నేరుగా కలిసి భరోసా కల్పిస్తున్న చంద్రబాబు - CBN Visit to Flood Affected Areas

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 3:44 PM IST

thumbnail
వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన- బాధితులను నేరుగా కలిసి భరోసా కల్పిస్తున్న సీఎం (ETV Bharat)

CM Chandrababu Visit to Flood Affected Areas in Vijayawada : విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. దాదాపు 4 గంటల నుంచి వివిధ ముంపు ప్రాంతాల్లో నిర్విరామంగా సీఎం పర్యటిస్తున్నారు. వరద విలయం నుంచి విజయవాడను గట్టెక్కించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. రాత్రంతా విజయవాడలో పర్యటించిన ఆయన ఉదయమే తిరిగి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సింగ్‌ నగర్‌, యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి ప్రాంతాలను పరిశీలించారు.

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సమీప ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగుతోంది. మోకాళ్ల వరకు నీరు ఉన్న ప్రాంతాల్లో కాలినడకన, ఇంకా ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా బాధితుల వద్దకు వెళ్తున్నారు. బాధితుల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదులు అధికారులకు చెప్పి అప్పటికప్పుడు పరిష్కారానికి ఆదేశిస్తున్నారు. బాధితుల కష్టాలు తెలుసుకోవడంతోపాటు వరద ఉద్ధృతి, ముంపు నివారణ చర్యలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.