LIVE: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU VISIT RUSHIKONDA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-11-2024/640-480-22812816-thumbnail-16x9-cm-chandrababu-visit-rushikonda1.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2024, 3:22 PM IST
|Updated : Nov 2, 2024, 4:51 PM IST
Live: ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రుషికొండ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అనుమతి లేని రుషికొండ బీచ్కి వెళ్లే మరో రహదారిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో అనే అంశంపై ముఖ్యమంత్రి కీలక ఆలోచన చేయనున్నారు. రుషికొండపై సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు చేశారు. సీఎం వాహన శ్రేణి భద్రత పర్యవేక్షణ చేశారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీపీ అజితా వెజెండ్ల పర్యటన ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రా జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్ లో దాదాపు మూడు గంటలపాటు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. 40 ప్రభుత్వ శాఖలకు సంబందించిన ప్రగతి నివేదికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రుషికొండ సందర్శన ప్రత్యక్షప్రసారం
Last Updated : Nov 2, 2024, 4:51 PM IST