జగన్ హయాంలో నష్టపోయాం ఆదుకోండి - సీఎం చంద్రబాబుకు వినతులు - CM Chandrababu Receiving Requests - CM CHANDRABABU RECEIVING REQUESTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-07-2024/640-480-22004761-thumbnail-16x9-chandrababu-receiving-requests.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 9:46 PM IST
CM Chandrababu Receiving Requests from People at NTR Bhavan: మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించగా జనం పోటెత్తారు. సుమారు రెండున్నర గంటలపాటు చంద్రబాబు వినతులు స్వీకరించగా వైఎస్సార్సీపీ హయాంలో నష్టపోయామంటూ జనం నుంచి వినతులు వెల్లువత్తాయి. టీడీపీ నేతలు, శ్రేణులతో ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది. వైఎస్సార్సీపీ నేతలు తమ భూములు కబ్జా చేశారని సమస్యలను పరిష్కరించాలని చాలా మంది కోరారు. తమను రెగ్యులర్ చేయాలని గురుకుల పాఠశాలల టీచర్ల వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ఇచ్చిన ఉత్తర్వులు గత ప్రభుత్వం అమలు చేయలేదని గురుకుల టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకూ నిర్విరామంగా ఫిర్యాదుల స్వీకరణ సాగింది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు వినతులు ఇచ్చారు. వివిధ సమస్యలకు న్యాయస్థానం తీర్పులున్నా తమకు న్యాయం చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుపడ్డారని కొంతమంది ఫిర్యాదులలో పేర్కొన్నారు. తమ భూములు వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేసారంటూ ఇంకొందరు వినతలు సమర్పించారు. అందరి సమస్యలు ఓపిగ్గా విని తప్పక పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.