LIVE: కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రులు - ప్రత్యక్షప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2024, 4:24 PM IST
|Updated : 24 hours ago
CM CHANDRABABU BRIEFING ABOUT CABINET MEETING LIVE : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.3,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆలయాల్లో పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణ, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన, ఉచిత ఇసుక, మద్యం విధానం, టెక్స్టైల్ పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన విలువైన భూములను వెనక్కి తీసుకునే అంశంపైనా చర్చ జరిగింది.అలాగే ఉచిత ఇసుక, రేషన్, అమరావతి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రేషన్ డీలర్ల నియామకం, కొత్తరేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం పనులు, దేవాలయాల పాలకమండళ్ల సంఖ్య పెంపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వివరాలన్నింటినీ మంత్రులు మీడియా సమావేశంలో వివరిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : 24 hours ago